Homeఆంధ్రప్రదేశ్ఆ ముగ్గురికీ ప్రధాని పదవిపై ఆశ!

ఆ ముగ్గురికీ ప్రధాని పదవిపై ఆశ!

Published on

బీజేపీ ప్రభుత్వాన్ని గద్దె దించడమే లక్ష్యంగా ‘ఇండియా’ కూటమి ఏర్పాటులో కీలక పాత్ర పోషించిన బెంగాల్‌, బీహార్‌ సీఎంలు మమతా బెనర్జీ, నితీశ్‌కుమార్‌లలో దీదీ ఇప్పటికే యూటర్న్‌ తీసుకున్నారు. నితీశ్‌ కూడా అదే బాటలో నడుస్తారని తేలిపోతున్నది. ప్రస్తుతం ఇండియా కూటమిలో ఉన్న పార్టీల అధినేత నేతలలో మమతా బెనర్జీ, నితీశ్‌కుమార్‌, అరవింద్‌ కేజ్రీవాల్‌ వీళ్ల ముగ్గురికీ ప్రధాని పదవిపై ఆశ ఉన్నది. తమిళనాడు సీఎం స్టాలిన్‌, మహారాష్ట్ర మాజీ సీఎం ఉద్ధవ్‌ఠాక్రే, ఎస్పీ అధినేత అఖిలేశ్‌కు కేంద్ర రాజకీయాలపై పెద్దగా ఆసక్తి లేదు.

వాళ్ల రాష్ట్రాల ప్రయోజనాలకే ప్రథమ ప్రాధాన్యం అని వాళ్లు అనేకసార్లు చెప్పారు. అలాగే కేంద్రంలో సమాఖ్య స్ఫూర్తిని కొనసాగించే పార్టీ అధికారంలో ఉంటే రాష్ట్రాలకు మేలు జరుగుతుందని వీళ్ల అభిప్రాయం. అందుకే వాళ్లు కేంద్రంలోని నరేంద్రమోదీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా కాంగ్రెస్‌తో కలిసి నడువాలని నిర్ణయించుకున్నారు. ఇక ఎన్సీపీ అధినేత శరద్‌ పవార్‌, ఆర్జేడీ అధినేత లాలు ప్రసాద్‌ యాదవ్‌ లాంటి వాళ్లు జాతీయ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించిన వాళ్లే. కేంద్రంలో మంత్రులుగా తమ పనితీరుతో ఆకట్టుకున్నవాళ్లే.ఆయన అంతిమ లక్ష్యంగా ప్రధాని పదవే. బహుశా ఎన్నికల ఫలితాల అనంతరం తమ నిర్ణయాన్ని ప్రకటిస్తామని చెప్పే అవకాశాలున్నాయి.

కానీ ఇండియా కూటమికి తానే నాయకత్వం వహించాలని భావించారు. కానీ మిగతా పక్షాలు ఖర్గేను ప్రతిపాదించగా.. కన్వీనర్‌ పదవిని నితీశ్‌కు కట్టబెట్టాలని అనుకున్నారు. కానీ ఆయన టార్గెట్‌ ప్రధాని పదవి. అందుకే ఆయన తనకు తాను ఆశించిన పదవి దక్కని చోట ఉండటం ఎందుకు అన్న ఆలోచనతోనే మరోసారి ఆయన కాషాయపార్టీ వైపు చూస్తున్నారనేది రాజకీయవర్గాల్లో జరుగుతున్న చర్చ. ఇప్పటికైతే నితీశ్‌ మళ్లీ బీజేపీతో చేరుతున్నట్టు అధికారికంగా ప్రకటించకున్నా.. ఎన్నికల షెడ్యూల్‌ నాటికి ఒంటరిగా పోటీ చేయడమో లేదా బీజేపీతో కలిసి పోటీ చేయడమో కచ్చితంగా జరుగుతుందని అంటున్నారు.అందుకే ఆయన వివిధ రాష్ట్రాల్లో తన పార్టీని విస్తరించి అక్కడ అధికారంలోకి రావడానికి అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో ఢిల్లీ రాష్ట్ర అభివృద్ధి నమూనాను పదే పదే ప్రస్తావిస్తున్నారు.

ఇండియా కూటమిలో తాను కొనసాగాలంటే బెంగాల్‌ బాధ్యతలు తనకే అప్పగించాలని ఆమె స్పష్టం చేశారన్న వార్తలు అప్పట్లో వచ్చాయి. ‘దేశంలో కాంగ్రెస్‌ పార్టీ సొంతంగా 300 సీట్లలో పోటీ చేయాలి. ప్రాంతీయ పార్టీలన్నీ కలిసి కట్టుగా ఉన్నాయి. అవి మిగతా సీట్లలో పోటీ చేస్తాయి. బెంగాల్‌లో మాత్రం కాంగ్రెస్‌ పార్టీ జోక్యాన్ని అనుమతించబోం. విపక్ష కూటమికి మేం కట్టుబడే ఉన్నాం. జాతీయస్థాయిలో కూటమి భాగస్వామిగా మేం మా వ్యూహాన్ని ఎన్నికల తర్వాత నిర్ణయిస్తాం. విపక్షాలంటే ఏ ఒక్క పార్టీకి చెందినవో కావు. మేమంతా ఐక్యంగా ఉండి, బీజేపీని ఓడించడానికి ఏం చేయాలో అది చేస్తాం’ అని ఆమె స్పష్టం చేశారు. దీనికి వామపక్షాలు, బెంగాల్‌ కాంగ్రెస్‌ రాష్ట్ర నేతలు అంగీరించే పరిస్థితి లేదు. అంతేకాదు బెంగాల్‌లో కాంగ్రెస్‌, వామపక్షపార్టీలు టీఎంసీకి వ్యతిరేకంగా పోరాడుతున్నాయి.

కాంగ్రెస్‌ పార్టీ సీపీఎంను కలుపుకొని వెళ్తే కేరళ, బెంగాల్‌, త్రిపుర రాష్ట్రాల్లోనే కాదు తెలంగాణ, ఏపీ వంటి రాష్ట్రాల్లోనూ వారికి కొంత ఓటు బ్యాంకు ఉంటుంది. అది లోక్‌సభ ఎన్నికల్లో ఇండియా కూటమికి విజయానికి దోహదపడుతుందని కాంగ్రెస్‌ అధిష్ఠానం ఆలోచన. బెంగాల్‌లో సీట్ల సర్దుబాటుపై మమత ఒప్పుకోరని తెలుసు. అందుకే ముందుగానే తాము ఒంటరిగానే పోటీ చేస్తామని, ఎన్నికల ఫలితాల అనంతరం వ్యూహాన్ని నిర్ణయిస్తామని మమత చెబుతున్నారు. గతంలో ప్రాంతీయపార్టీల మధ్య కుదిరిన ఒప్పందం మేరకు దేవెగౌడ ప్రధాని అయిన విషయం విదితమే. అలాంటి ఒప్పందాన్నే ఇప్పుడు ఇండియా కూటమికి దూరంగా జరుగుతున్న ముఖ్యంగా నితీశ్‌కుమార్‌, మమతా బెనర్జీ, అరవింద్‌ కేజ్రీవాల్‌ ముందుకు తెచ్చే అవకాశాలు ఉన్నాయన్న అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయి.

నితీశ్‌కుమార్‌, మమతా బెనర్జీ వలే కాకుండా అరవింద్‌ కేజ్రీవాల్‌ క్లియర్‌గానే ఉన్నారు. ఢిల్లీలో అధికారం చేపట్టిన తర్వాత ఆయన తన పార్టీని విస్తరించే పనిని చాలా ఏళ్ల కిందటే మొదలుపెట్టారు. గుజరాత్‌, ఉత్తరాఖండ్‌, గోవా, మధ్యప్రదేశ్‌, రాజస్థాన్‌ వంటి రాష్ట్రాల్లో పోటీ చేసినా పంజాబ్‌లో మాత్రం ఆయన వ్యూహాలు ఫలించాయి. రానున్న లోక్‌సభ ఎన్నికల్లో ఆయన వీలైనంత ఎక్కువ స్థానాల్లో పోటీ చేయాలని అనుకుంటున్నారు. అందుకే ముందుగా పంజాబ్‌, ఢిల్లీ బాధ్యతలు తనకే ఇవ్వాలని మమతా ద్వారా చెప్పించారు. కానీ పంజాబ్‌లో కాంగ్రెస్‌ రాష్ట్ర నాయకత్వం ఆ ప్రతిపాదనకు అంగీకరించవద్దని తమ అధిష్ఠానానికి సూచించింది. దీంతో దీదీ బాటలోనే పంజాబ్‌, ఢిల్లీలో ఒంటరిగానే పోటీ చేయాలని ఆప్‌ నిర్ణయించింది. కేజ్రీవాల్‌ కూడా ప్రధాని పదవి చేపట్టాలని ఉన్నది.

బీజేపీ ప్రభుత్వాన్ని గద్దె దించడమే లక్ష్యంగా ‘ఇండియా’ కూటమి ఏర్పాటులో కీలక పాత్ర పోషించిన బెంగాల్‌, బీహార్‌ సీఎంలు మమతా బెనర్జీ, నితీశ్‌కుమార్‌లలో దీదీ ఇప్పటికే యూటర్న్‌ తీసుకున్నారు. నితీశ్‌ కూడా అదే బాటలో నడుస్తారని తేలిపోతున్నది. ప్రస్తుతం ఇండియా కూటమిలో ఉన్న పార్టీల అధినేత నేతలలో మమతా బెనర్జీ, నితీశ్‌కుమార్‌, అరవింద్‌ కేజ్రీవాల్‌ వీళ్ల ముగ్గురికీ ప్రధాని పదవిపై ఆశ ఉన్నది. తమిళనాడు సీఎం స్టాలిన్‌, మహారాష్ట్ర మాజీ సీఎం ఉద్ధవ్‌ఠాక్రే, ఎస్పీ అధినేత అఖిలేశ్‌కు కేంద్ర రాజకీయాలపై పెద్దగా ఆసక్తి లేదు.

వాళ్ల రాష్ట్రాల ప్రయోజనాలకే ప్రథమ ప్రాధాన్యం అని వాళ్లు అనేకసార్లు చెప్పారు. అలాగే కేంద్రంలో సమాఖ్య స్ఫూర్తిని కొనసాగించే పార్టీ అధికారంలో ఉంటే రాష్ట్రాలకు మేలు జరుగుతుందని వీళ్ల అభిప్రాయం. అందుకే వాళ్లు కేంద్రంలోని నరేంద్రమోదీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా కాంగ్రెస్‌తో కలిసి నడువాలని నిర్ణయించుకున్నారు. ఇక ఎన్సీపీ అధినేత శరద్‌ పవార్‌, ఆర్జేడీ అధినేత లాలు ప్రసాద్‌ యాదవ్‌ లాంటి వాళ్లు జాతీయ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించిన వాళ్లే. కేంద్రంలో మంత్రులుగా తమ పనితీరుతో ఆకట్టుకున్నవాళ్లే.ఆయన అంతిమ లక్ష్యంగా ప్రధాని పదవే. బహుశా ఎన్నికల ఫలితాల అనంతరం తమ నిర్ణయాన్ని ప్రకటిస్తామని చెప్పే అవకాశాలున్నాయి.

కానీ ఇండియా కూటమికి తానే నాయకత్వం వహించాలని భావించారు. కానీ మిగతా పక్షాలు ఖర్గేను ప్రతిపాదించగా.. కన్వీనర్‌ పదవిని నితీశ్‌కు కట్టబెట్టాలని అనుకున్నారు. కానీ ఆయన టార్గెట్‌ ప్రధాని పదవి. అందుకే ఆయన తనకు తాను ఆశించిన పదవి దక్కని చోట ఉండటం ఎందుకు అన్న ఆలోచనతోనే మరోసారి ఆయన కాషాయపార్టీ వైపు చూస్తున్నారనేది రాజకీయవర్గాల్లో జరుగుతున్న చర్చ. ఇప్పటికైతే నితీశ్‌ మళ్లీ బీజేపీతో చేరుతున్నట్టు అధికారికంగా ప్రకటించకున్నా.. ఎన్నికల షెడ్యూల్‌ నాటికి ఒంటరిగా పోటీ చేయడమో లేదా బీజేపీతో కలిసి పోటీ చేయడమో కచ్చితంగా జరుగుతుందని అంటున్నారు.అందుకే ఆయన వివిధ రాష్ట్రాల్లో తన పార్టీని విస్తరించి అక్కడ అధికారంలోకి రావడానికి అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో ఢిల్లీ రాష్ట్ర అభివృద్ధి నమూనాను పదే పదే ప్రస్తావిస్తున్నారు.

తెలంగాణ విద్యుత్ సంస్థల్లో అక్రమ నియామకాలు!?

ఎన్పీడీసీఎల్ పై సీమాంధ్రులు పెత్తనం డైరెక్టర్ల నియామకంపై రగిలి పోతున్న విద్యుత్ ఉద్యోగులు సీనియారిటీని విస్మరించడంపై ఉద్యోగుల ఆసంతృప్తి తెలంగాణ కు చెందిన సీజీఎంలు డైరెక్టర్లకు అర్హులు కారా! ఇది ఆత్మగౌరవ సమస్య-...

జర్నలిస్టులకి ఆర్టీసి ఉచిత ప్రయాణం!?

రాత్రి పగలు తేడా లేకుండా సమాజ హితంకోసం కాలంతో పోటీ పడి పని చేసే జర్నలిస్టులకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించాలనే డిమాండ్ సర్వత్రా వినిపిస్తున్నది. సీఎం రేవంత్ రెడ్డి ఇటీవల...

బీఆరెస్‌ ప్రక్షాళన దిశగా కేసీఆర్ మేధో మథనం!

తెలంగాణ ఆచరిస్తుంది.. దేశం అనుసరిస్తుందంటూ తెలంగాణ సంక్షేమ, అభివృద్ధి పథకాలే దేశంలోని అన్ని రాష్ట్రాలకు ఆదర్శంగా మారాయని గొప్పగా ప్రచారం చేసినా అసెంబ్లీ ఎన్నికల్లో బీఆరెస్‌ ఓటమిపాలైంది. దీనిపై అంతర్మథనం చెందుతున్న గులాబీ...